మిర్యాలగూడటౌన్, నవంబర్ 27 : దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, దేశాన్ని సన్మార్గంలో నడిపించే భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత వారిదేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. పట్టణంలోని రామచంద్రగూడెంలో గల ఎస్ఎస్ఆర్ ఫంక్షన్హాల్లో ఆదివారం టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ యూరప్, అమెరికా, చైనా వంటి దేశాల్లో మాదిరిగా విద్యావ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తేనే విద్యావ్యవస్థ బలపడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ, ఏకపక్ష నిర్ణయాలు, మతతత్వ విధానాల వల్ల దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. విద్యావ్యవస్థపై తన విధానాలను బలవంతంగా రుద్దుతుందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ఉపాధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాగమణి, శ్రీనివాసాచారి, శేఖర్రెడ్డి, ఎంపీపీ నూకల సరళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ భవనం ప్రారంభం
మిర్యాలగూడటౌన్ : పట్టణంలోని సుందర్నగర్లో నిర్మించిన టీఎస్ యూటీఎఫ్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భవన నిర్మాణానికి కృషి చేసిన సంఘం బాధ్యులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యాలయం విజ్ఞాన కేంద్రంగా ఉపయోగపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఈఓలు బాలాజీ నాయక్, ఛత్రునాయక్, బాలూనాయక్, బక్క శ్రీనివాసాచారి, నాగమణి, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్చంద్ర, మంగ్యానాయక్, భీమ్లానాయక్, వెంకన్న, పాల్వాయి శ్రీనివాస్, మధుసూదన్, జాకీర్ హుస్సేన్, పాషా పాల్గొన్నారు.