నీలగిరి, మే 6: ఎప్పుడూ మూస పద్ధతిలో కాకుండా డిమాం డ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. రైతు వారోత్సవంలో భాగంగా రైతులకు వివిధ అంశాలపై బుధవారం పానగల్ రైతు వేదికలో జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని, ప్రత్యేకంగా ఆయా భూములకు అనుకూలంగా ఉన్న పంటలు పండిస్తే అధిక దిగుబడి, అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఆయా గ్రామాల్లోని భూములకు అనుగుణంగా పంటలు వేసేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైతే స్పెషల్ డ్రైవ్ చేపట్టి, భూముల్లోని సారాన్ని పరిశీలిస్తామన్నారు. పండిన పంటకు పూర్తిస్థాయిలో లాభం వచ్చినప్పుడే రైతు అలాంటి పంటల వైపు మొగ్గు చూపుతాడని, మారెట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నా రు. రైతులు ఒకే పంటను పండించకుండా అన్ని రకాల పంటలు పండించాలని, ప్రస్తుత వ్యవసాయ పద్ధతులు, కొత్తగా వస్తున్న మార్పులపై దృష్టి సారించి మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పంటలు పండించాలన్నారు.
నల్ల గొండ మేయర్ చైతన్య మాట్లాడుతూ ప్రభు త్వం రైతులకు సహకార శాఖ సొసైటీల ద్వారా అందించే పథకాలు సద్వినియో గం చేసుకోవాలన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పథకాలపై రైతులకు అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా సహకార అధికారి పత్యా నాయక్తోపాటు మారెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేశ్, పీఏసీఎస్ అధ్యక్షుడు నాగరత్నంరాజు, వం గాల సహదేవరెడ్డి, మారెటింగ్ ఏడీ ఛాయాదేవి, ఎల్డీఎం శ్రామిక్, వ్యవసాయ అధికారి శ్రవణ్ పాల్గొన్నారు.