చౌటుప్పల్, ఫిబ్రవరి 25 : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. వార్డు కౌన్సిలర్ల చేతుల మీదుగా విద్యార్థులకు ఈ వస్తు సామగ్రిని అందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్స్ ఉదరి యాదయ్య, కొయ్యడడ శేఖర్ గౌడ్, ఆలే శ్రీలత చిరంజీవి, గడ్డం ఇందిరా రాజారత్నం, నాయకులు జిట్ట కృష్ణ యాదవ్, నాని పాల్గొన్నారు.