మిర్యాలగూడ, ఫిబ్రవరి 23 : దళితబందు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు మైదానంలో మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 100 మందికి మంజూరైన దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బడుగుల మాట్లాడుతూ.. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టారని తెలిపారు. అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అన్నదాతలకు అండగా నిలిచే రైతుబంధు, రైతుబీమా పథకాలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు. 200 రూపాయలు ఉన్న ఆసరా పింఛన్ను రూ.2,016కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్రావును మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ.. .బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని అన్నారు. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్టం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. సీఎం కేసీఆర్ అండదండలతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామపంచాయతీలో రూ.3 నుంచి 10 కోట్ల అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఆర్డీఓ చెన్నయ్య, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు వీరకోటిరెడ్డి, ఎంపీపీలు నూకల సరళాహనుమంతరెడ్డి, ధనావత్ బాలాజీనాయక్, ధీరావత్ నందినీరవితేజ, పోకల శ్రీవిద్యారాజు, పుట్టల సునీత, జడ్పీటీసీలు ఇరుగు మంగమ్మావెంకటయ్య, లలితాహతీరాం, సేవ్యానాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మోషిన్ అలీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్నాయక్, జనరల్ మేనేజర్ ఆనంద్కుమార్, బీఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, యూసుఫ్, మట్టపల్లి సైదులుయాదవ్, చిన రామయ్య, కరుణాకర్రెడ్డి, బాబయ్య, ఏడుకొండల్ పాల్గొన్నారు.