నల్లగొండ, జూన్ 26 : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందిన 67 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన రూ.24,69,000/- విలువ గల చెక్కులను శుక్రవారం నల్లగొండలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.