దేవరకొండ, డిసెంబర్ 31 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంలాంటివని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలానికి చెందిన 98 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమ కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఉజ్జిని విద్యాసాగర్రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు గున్రెడ్డి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీ కుంబం శ్వేతాశ్రీశైలంయాదవ్, నాయకులు వింజమూరి రవి, ఎల్లంకి అశోక్, మోహన్, ఖాలేద్, ఏసు, బొడ్డుపల్లి కృష్ణ, ఆలంపల్లి వెంకటయ్య, సమర్ల శ్రీను, మురళీ పాల్గొన్నారు.
లతీబ్సాబ్ మృతికి నివాళి
దేవరకొండరూరల్ : మండలంలోని కొమ్మేపల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త పెద్ద లతీబ్సాబ్ శనివారం ఉదయం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, సర్పంచ్ దస్రు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతపల్లి పుల్లయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు సాజీద్పాష, వాజీద్సాష, బాలనారి, సలీం, సాలయ్య ఉన్నారు.
దేవరకొండను ఆదర్శ మున్సిపాల్టీగా తీర్చిదిద్దుతా
దేవరకొండను ఆదర్శ మున్సిపాల్లీగా తీర్చిదిద్దుతానని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని 9వ వార్డులో రూ.15లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పట్టణాలతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, వైస్ చైర్మన్ రహత్అలీ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కౌన్సిలర్ హన్మంత్ వెంకటేశ్గౌడ్, పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, వేముల రాజు, వడిత దేవేందర్ నాయక్, పొన్నబోయిన సైదులు, జయప్రకాశ్నారాయణ, మహ్మద్రైస్, చిత్రం ప్రదీప్, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియాస్ పటేల్, హన్మంత్ సాయి, రవి, మల్లేశ్, రాజు, భాస్కర్ పాల్గొన్నారు.