డిండి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామాలలో కుల వృత్తులకు పూర్వవైభవం దక్కిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎంపీపీ మాధవరం సునీత, జడ్పీటీసీ దేవేందర్రావుతో కలిసి మండల కేంద్రంలోని డిండి ప్రాజెక్టులో చేపపిల్లలను వదిలారు.
అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొని మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డ పెండ్లి భారం కాకూడదని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం ప్రవేశ పెట్టారని. ప్రభుత్వం అందజేస్తున్న ఈ పథకంతో ఆడపిల్లల తల్లిదండ్రులకు భారం తగ్గిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా డిండి మండలంలో ఇప్పటి వరకు సుమారు పదికోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారు లకు అందజేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తుల పరిశీలనలో జరుగుతున్న తాత్సారానికి గల కారణాలను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులందరికీ కల్యాణలక్ష్మి డబ్బులు అందించేందుకు బాధ్యత తీసుకుంటానన్నారు.
ఈ సందర్భంగా డిండి మండలానికి 108అంబులెన్స్, పట్టణంలో మెయిన్రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక సర్పంచ్ మేకల సాయమ్మ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే స్పందించి తన నిధుల నుంచి అంబులెన్స్, దీపావళి నాటికి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానని మాట ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీడీవో గిరిబాబు, డిప్యూటీ తహసీల్దార్ ప్రశాంత్, జిల్లా మత్స్యాభివృద్ధి అధికారి చరిత, సహాయకులు నిరంజన్, రాజు, పీఏసీఎస్ చైర్మన్లు నాగార్జున్రెడ్డి, శ్రీనివాసరావు, భగవంతరావు, విష్ణువర్ధన్రెడ్డి, రాఘవాచారి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.