ఆల్ ఇండియా 173వ ర్యాంకు సాధించిన ధీరజ్రెడ్డి
తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 16 : యూపీఎస్సీ మంగళవారం వెలువరించిన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం అల్వాల గ్రామానికి చెందిన పెంకీస్ ధీరజ్రెడ్డి ఆల్ ఇండియా 173వ ర్యాంకును సాధించాడు. పెంకీస్ సత్యనారాయణరెడ్డి హేమలత కుమారుడు ధీరజ్రెడ్డి సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యాడు. మూడు అంటెప్ట్లు ఇచ్చి రెండు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినప్పటికీ సెలెక్ట్ కాలేకపోయాడు. ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో కష్టపడి చదివాడు. 2023లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షకు హాజరై ప్రిలిమ్స్, మెయిన్స్ క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూకు వెళ్లాడు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా 173వ ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సందర్భంగా ధీరజ్రెడ్డి మాట్లాడుతూ ఈ ర్యాంక్తో తనకు ఈ సారి ఐపీఎస్ లేదా ఐఆర్ఎస్ వస్తుందని, ఉద్యోగం చేసుకుంటూనే తిరిగి సివిల్స్కు ప్రిపేర్ అయి ఐఏఎస్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. సివిల్స్లో ర్యాంకు సాధించిన ధీరజ్రెడ్డిని స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు అభినందించారు.