నల్లగొండ రూరల్, జనవరి 23 : ప్రజల అవసరాల మేరకు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల చేపట్టాలని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులు,పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 8 మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రారంభించాల్సిన పనులు,ప్రతిపాదిత పనులు,బడ్జెట్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గతంలో చేపట్టిన అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుకున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమివ్వాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్పాటిల్, నల్లగొండ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ రవి, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ కందుకూరి వెంకటేశ్వర్లు, ఈఈ సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ -శ్రమ్ పోర్టల్ నమోదు చేయాలి
అసంఘటితరంగ కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వారి వివరాలను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ దాసరి హరిచందన అధికారులకు సూచించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై కలెక్టరేట్లో ఆమె సమీక్షించారు. ఈ పథకం ద్వారా చేరిన ప్రతి ఆ సంఘటిత కార్మికుడికి ప్రత్యేక గుర్తింపు కార్డు (యూనివర్సల్ ఐడెంటికిఫికేషన్ నంబర్తో కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్డు ఉంటే ప్రభు త్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు , వివిధ సంక్షేమ పథకాలు వర్తిస్తాయన్నారు. సమావేశంలో కార్మికశాఖ డీసీ. రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.