మిర్యాలగూడ రూరల్, జనవరి 14 : పల్లెల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు 20 లక్షలు, ఎన్ఆర్ఈ జీఎస్ నిధులు రూ.15 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శనివారం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో అంతర్గత రోడ్లను సీసీగా మారుస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని సర్పంచులకు సూచించారు. కార్యక్రమంలో ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబునాయక్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, సర్పంచ్ చౌగాని భిక్షమ్గౌడ్, ఎంపీటీసీ పాశం హైమావతి, ఉపసర్పంచ్ ఎల్లమ్మ, మాజీ ఎంపీటీసీ భూక్యా సైదానాయక్, పానుగోతు ఈశ్వర్, కారింగుల శేఖర్, జానపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.
పల్లెల్లోనే పండుగ సంబురాలు
దామరచర్ల : పల్లెల్లో పండుగ సంబురాలు ఆనందాన్ని పంచుతాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. దామరచర్ల మాజీ సర్పంచ్ వరలక్ష్మి జ్ఞాపకార్థంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ముగ్గుల పోటీలను ఆయన ప్రారంభించి పరిశీలించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో ప్రజలు ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్చైర్మన్ డి. నారాయణరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కె. వీరకోటిరెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలిత, సర్పంచ్ బంటు కిరణ్, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి, నాయకులు బాల సత్యనారాయణ, బైరం నర్సయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు ఎస్కే. నాగుల్మీరా, పడిగెపాటి కోటిరెడ్డి, ఎండీ. యూసుఫ్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.