దేవరకొండ: అన్నిదానాల్లో రక్తదానం ఎంతో గొప్పదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆది వారం స్పోర్ట్స్ భవన్లో స్పోర్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒక మారు రక్తదానం చేయాలని అన్నారు.
ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు పోతున్నారని ఆయన గుర్తు చేశారు. కార్య క్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్యక్షుడు ఎన్విటి, వైస్ చైర్మన్ రహత్అలీ, జయప్రకాశ్ నారాయణ, బొడ్డుపల్లి కృష్ణ, తాళ్ల శ్రీధర్గౌడ్, వైఎస్ కరుణాకర్, వరికుప్పల సురేశ్, రమేశ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.