పెద్దఅడిశర్లపల్లి, ఫిబ్రవరి 23 : గిరిజన ఆవాసాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. గురువారం మండలంలోని పడమటితండా, పుట్టంగండి గ్రామాల్లో ‘మన ఊరు -మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా రూ. 20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పడమటితండాలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా పెద్దగట్టు, బూడిదగట్టు, పావురాల గట్టు వంటి మారుమూల ప్రాంతాలకు సైతం స్వచ్ఛమైన తాగునీరు, నంభాపురం, పెద్దగట్టు లిఫ్టులతో సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు.
మండలంలోని గిరిజన ఆవాసాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరించి అర్హులైన రైతులకు హక్కు పత్రాలను అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంగాల ప్రతాప్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వల్లపురెడ్డి, సర్పంచ్ భీమానాయక్, శీలం శేఖర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నాయకులు కిషన్, నరియా, లక్పతి, చందు, మహేందర్ పాల్గొన్నారు.
దర్గాలో పూజలు
దేవరకొండ : పట్టణంలోని హజ్రత్ సులేమాన్ షా వలీ దర్గా ఉర్సులో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, డీఎస్పీ నాగేశ్వర్రావు, సీఐ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, శిరందాసు కృష్ణయ్య, వడ్త్య దేవేందర్నాయక్, ఉస్మాన్ ఉన్నారు.