దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు అకర్శితులై అన్ని పార్టీల నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు.
మంగళవారం నియోజకవర్గంలోని చింతపల్లి మండలం కిష్టారాయినిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెంది న 150 మంది క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంకణాల వెంక ట్రెడ్డి, మండలాధ్యక్షుడు దొంతం చంద్రశేఖర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి అహ్వనించారు.