దేవరకొండ: కేసీఆర్తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో చింతపల్లి మండలం కుర్మేడ్కు చెందిన 20 మంది కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని అట్టి పథకాలకు అకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. రైతు భీమా, రైతు బంధు లాంటి చారిత్రాత్మక పథకాలకు రూపకల్పన చేసి దేశంలో ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.
పార్టీలో చేరిన వారిలో చికొండ పెద్ది రాజు, రాదిరి రమేశ్, గజ్జ మహేశ్, వర్కాల శిశ, రాకేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్ర మంలో కుర్మేడ్ ఎంపీటీసీ శ్వేత శ్రీశైలం గౌడ్, మాజీ సర్పంచ్ రమేశ్, గ్రామాధ్యక్షుడు యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.