చందంపేట: నూరేండ్ల వరకు చెక్కు చెదరని టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పార్టీ ఆధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చందంపేట మండలంలోని బిల్డింగ్ తండా లో జరిగిన టీఆర్ఎస్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్థాయి నుంచి కార్యక ర్తలను ఆదుకునే స్థాయికి ఎదిగిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షే పథకాలు గడపగడపకు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు.
పార్టీ కోసం కష్టపడి, క్రమశిక్షణ, నిబద్దతతో పనిచేసే వారికి కమిటీలో సముచిత స్థానం వుంటుందని రవీంద్రకుమార్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అకర్షితులై యువత అధిక సంఖ్యలో పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
సమావేశంలో మండలాధ్యక్షుడు లకా్ష్మనాయక్, సర్పంచ్ మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, జడ్పీటీసీ సల హదారుడు రమావత్ మోహన్కృష్ణ, గోసుల అనంతగిరి, ఎర్పుల గోవింద్యాదవ్, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, వీరారెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా ముత్యాల సర్వయ్య, ప్రధాన కార్యదర్శిగా శంకర్ నాయక్లను ఎన్నుకున్నారు.