చందంపేట(దేవరకొండ), ఏప్రిల్ 6 : రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం ఆగదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు శనివారం దేవరకొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చేపట్టిన రైతు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఎకరానికి రూ.25వేల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రూ.2లక్షల రుణమాఫీ ఊసే లేకుండాపోయిందని, ఎకరానికి రూ.15 ఇస్తామన్న రైతుబరోసా, ధాన్యానికి బోనస్ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరిస్తుందన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పంటలు పండడం తప్ప.. ఎండిన సందర్భాలు లేవని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతావత్ బీల్యానాయక్, నాయకుడు గాజుల ఆంజనేయులు, మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, కంకణాల వెంకట్రెడ్డి, సురేశ్గౌడ్, వల్లపురెడ్డి, వెంకటేశ్వర్రావు, రమేశ్నాయక్, రాఘవాచారి, శ్రీనివాస్గౌడ్, లోక్యానాయక్, జానీబాబా, రాజు, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియాస్ పటేల్, బాబా, నెహ్రూనాయక్, బాలూనాయక్, బషీర్, శంకర్నాయక్, మున్నయ్యయాదవ్, బాలవర్ది రాజు, మోహన్, మహేశ్ పాల్గొన్నారు.