నకిరేకల్లో 134మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం దేశా నికి ఆదర్శమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 134మంది లబ్ధి దారులకు మంజూరైన రూ.1.35 కోట్ల విలువ గల కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సోమవారం నకిరేకల్ సాయి బాబా దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాల నలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందడంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందజేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పేద ప్రజల కుటుంబాల్లో సంతోషం నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధం గా తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తుందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథ కాలను అమలు చేస్తుందన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, కౌన్సిలర్లు పల్లె విజయ్, రాచకొండ సునీల్, భిక్షంరెడ్డి స్వామి, వెంకన్న, అనిత, అఖిల తదితరులు పాల్గొన్నారు.
చందుపట్లలో మేదరి(మహేంద్ర) కమ్యూనిటీహాల్ నిర్మాణానికి శంకుస్థాపన
కట్టంగూర్(నకిరేకల్): అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని చందుపట్ల గ్రామంలో కేతేశ్వర స్వామి మేదరి(మహేంద్ర) కమ్యూనిటీహాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. మేదరులు ఐక్యమత్యానికి మారుపేరని అందరు కలిసిమెలిసిగా ఉండి అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
మున్సిపాలిటీ నుంచి బోరుమోటరుతో పాటు భవన నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. భవన నిర్మాణానికి అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వ పరంగా సమకూర్చుతానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, జడ్పీటీసీ మాధ ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.