నందికొండ, ఫిబ్రవరి 8 : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని నల్లగొండ, హైదరాబాద్ వై జంక్షన్ వద్ద ఉన్న ఎకో పార్కులోని ఓ జింక గురువారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కులోని జింక తిరుమలాయగట్టు సమీపంలో రోడ్డు వద్ద జింక మృతి చెంది ఉంది. స్థానికులు గమనించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పర్యాటకుల కోసం ఇటీవల ఫారెస్టులో జింకలను వదిలారు. జింకల సంరక్షణకు రక్షణ లేకపోవడంతోనే జింకలు రోడ్డుపైకి రావడంతో ఎవరో చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫారెస్ట్ రేంజర్ రాఘవేంద్రను వివరణ కోరగా.. ఇటీవల ఫారెస్ట్లో వదిలిన జింకల్లో ఒకటి రోడ్డుపైకి రావడంతో కుక్క లు చంపి ఉంటాయని అన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపడుతామన్నారు.