దేవరకొండ, జూన్ 11 : దేవరకొండ మండలం జార్పుల తండా జార్పుల హర్షవర్ధన్, జార్పుల బిట్టు ప్రమాదవశాత్తు బావి గుంతలో పడి మృతి చెందడం బాధాకరం అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో హర్షవర్ధన్, బిట్టు ల మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్షవర్ధన్, బిట్టు ల మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట జార్పుల వాగ్య, నేనావత్ శ్రీను, గణేష్ ఉన్నారు.