నల్లగొండ, మే 2 : బ్యాంకు పాలకవర్గంతోపాటు ఉద్యోగుల సమష్టి సహకారంతోనే బ్యాంకు అభివృద్ధిలో పయనిస్తుందని, దాంతోనే తనకు జాతీయ స్థాయిలో ఉత్తమ చైర్మన్గా అవార్డు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందరెడ్డి అన్నారు. ఉత్తమ చైర్మన్ అవార్డు వచ్చినందుకు శనివారం డీసీసీబీలో మహేందర్రెడ్డిని పాలకవర్గ సభ్యులతోపాటు బ్యాంకు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2020 నుంచి నేటి వరకు రూ.900 కోట్ల నుంచి రూ.2400 కోట్లకు టర్నోవర్ పెరగటానికి సమష్టి కృషినే కారణమన్నారు.
మా పాలకవర్గం రాక ముందు 11 శాతంగా ఉన్న ఎన్పీఏ నేడు 1.83 శాతానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. డిపాజిట్లు సైతం రూ.400 కోట్ల నుంచి రూ.674 కోట్లకు పెంచామన్నారు. బ్యాంకు లాభాలను రూ.7.9 కోట్ల నుంచి రూ.30.16 కోట్లకు పెంచగలిగినట్లు చెప్పారు. దీర్ఘకాలిక రుణాలతోపాటు విద్యా రుణాల మంజూరులో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. జిల్లాలో 6 కొత్త బ్రాంచ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని, కొత్త నియామకాలు చేపట్టామని చెప్పారు. కార్యక్రమంలో సీఈఓ శంకర్రావు, జీఎం వసంతకుమార్, డైరెక్టర్లు రంగాచారి, సంపత్రెడ్డి, శ్రీనివాస్, కరుణ, ఉద్యోగ సంఘం నాయకులు రాజు, అలీముద్దీన్, సుగుణ్, రవీందర్, శ్రీధర్రెడ్డి, శ్రవణ్రెడ్డి, సతీశ్, రాజేశ్, సిబ్బంది పాల్గొన్నారు.