యాదగిరిగుట్ట, ఏప్రిల్ 19 : కలిసి కట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిద్దామని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఆలేరు నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, మళ్లీ ఎగిరేది గులాబీ జెండానేనని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బుధవారం ఆయన సమక్షంలో గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉప సర్పంచ్ బందెల ప్రమోద్, కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు ఎర్ర పరుశరాములు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు లింగస్వామి యాదవ్, అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి బందె ప్రసాద్, కా్రంగెస్ పార్టీ మాజీ వార్డు సభ్యులు ఆధ్వర్యంలో 200మంది ఆయా పార్టీలకు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర సంక్షేమ పథకాలు అమలుచేసి దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్నదని విమర్శించారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరో వైపు బీజేపీ పార్టీని ఎండగడుతూ ప్రచారం చేపట్టాలని సూచించారు.
కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ గుండాల మండలాధ్యక్షుడు ఎండీ.ఖలీల్, మండల సెక్రటరీ జనరల్ సంగి వేణుగోపాల్యాదవ్, ఎంపీపీ తాండ్ర అమరావతి, రైతుబంధు సమితి కన్వీనర్ గడ్డమీది పాండరి, సీనియర్ నాయకులు కోలుకొండ రాములు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు ఈమ్మడి దశరథ, సీనియర్ నాయకులు ఉప్పలయ్య, మాజీ ఎంపీపీ నత్తి లచ్చయ్య, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు రమేశ్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పసుల నాగరాజు, పీఏసీఎస్ డైరక్టర్ జంపాల కొమురయ్య, మాజీ సర్పంచ్ గడ్డం కొమురయ్య, రైతుబంధు సమితి గ్రామ సమితి కన్వీనర్ నోముల సోమనర్సయ్య పాల్గొన్నారు.