కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
కోదాడ, జూన్ 26 : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో దళితబంధు పథకం పొందిన లబ్ధిదారుడు ఏర్పాటుచేసుకున్న మెడికల్ అండ్ జనరల్ స్టోర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహించుకొని ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందన్నారు. దళితులంతా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు. ఈ సందర్భంగా దుకాణాదారుడు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కోదాడ ఎంపీపీ కవితారాధారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బుర్రా పుల్లారెడ్డి, కౌన్సిలర్లు సామినేని ప్రమీలారమేశ్, నరేశ్, కోదాటి కృష్ణయ్య, కనగాల శ్రీధర్, బత్తుల ఉపేందర్, నాని, వెంకటయ్య పాల్గొన్నారు.