గుర్రంపోడు, సెప్టెంబర్ 16 : గుర్రంపోడు మండలం తానేదారిపల్లి రైతు వేదికలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాలియా వ్యవసాయ సహాయ సంచాలకులు సరిత పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యత, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడం, సహజ పద్ధతులతో పంటలు సాగు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు, పంటల నాణ్యతను పెంచుకోవచ్చని వివరించారు. రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు వ్యవసాయ అధికారి కంచర్ల మాధవ రెడ్డి, ఏఈఓ, తానేదారిపల్లి సర్పంచ్ కంచర్ల యాదమ్మ మధుసూదన్, జిన్నాయిచింత సర్పంచ్ వడ్లమల్ల పుష్పలత యాదయ్య, ఉప సర్పంచులు పాల్వాయి ఏడుకొండలు, కట్టేబోయిన వెంకటయ్య పాల్గొన్నారు.