భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 17 : అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మారుస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెకిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఒప్పించాలన్నారు. ఒప్పించకుంటే పదవులకు రాజనామా చేసి ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల పక్షాన పోరాడాలని మాజీ శాసనమండలి సభ్యుడు, మాజీ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల సమస్యలు పరిషరించాలని, అలైన్మెం ట్ మార్చాలని భువనగిరి కలెక్టరేట్ ఎదుట వందలాదిమంది బాధిత నిర్వాసిత రైతులతో సామూహిక నిరాహార దీక్ష , వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అశాస్త్రీయంగా ఉందని, వెంటనే అలైన్మెంట్ను మార్చాలని డిమాండ్ చేశారు.
ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉండాలని, మొదటి అలైన్మెంట్లో ప్రకటించిన ప్రకారం ఎందుకు అమలు చేయడం లేదని, ఎవరి ప్రయోజనాల కోసం అలైన్మెంట్ మార్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రింగ్ రోడ్ అంటే వంకలు, డొంకలు, మలుపులు ఎట్లా ఉంటాయన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ రింగ్ రోడ్డును రద్దు చేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. జిల్లాలో 8 మండలాలు 43 గ్రామాల్లోని వందలాది ఎకరాల విలువైన సాగుకు యోగ్యమైన, భూమే ఆధారంగా బతుకుతున్న రైతులు తమ భూములను కోల్పోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే బస్వాపురం రిజర్వాయర్ పేరుతో, కాల్వల పేరుతో, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారుల పేరుతో, హైటెన్షన్ విద్యుత్ స్తంభాలు, వైటీడీఏ పేరిట భూములు కోల్పోయి తీవ్ర మనోవేదనతో, మానసిక క్షోభను అనుభవిస్తూ అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న బహిరంగ మారె ట్ ధరకు మూడింతలు రేటును కలిపి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ వీరారెడ్డికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, ట్రిపుల్ ఆర్ నిర్వాసితుల నాయకులు అవిశెట్టి పాండు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గభ్యులు మాటూరు బాలరాజు దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సిర్పంగి స్వామి, దయ్యాల నరసింహ, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, గంగదేవి సైదులు, గడ్డం వెంకటేశ్, సీనియర్ నాయకులు దొంతగాని పెద్దులు, శ్రీనివాసరెడ్డి, నాయకులు పల్లెర్ల అంజయ్య, వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, లావుడియ రాజు, వడ్డేబోయిన వెంకటేశ్, గంటేపాక శివ, లలిత తదితరులు పాల్గొన్నారు.