యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక చైర్మన్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారని ఎదురు చూస్తున్నారు. కీలక పదవి కోసం ఇప్పటికే ఆశావహులు పైరవీలు షురూ చేశారు. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గాంధీ భవన్లోని గాడ్ ఫాదర్లతో మంతనాలు జరుపుతున్నారు. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులు క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. పోచంపల్లిలో హంగ్ రావడంతో గెలిచిన అభ్యర్థులను రహస్య ప్రాంతానికి తరలించారు. కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5 స్థానాలు దక్కించుకున్నాయి. బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకమయ్యారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థిని సైతం వేర్వేరు శిబిరాలకు పంపించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ ఇద్దరు క్యాండిడేట్లకు మస్తు డిమాండ్ పలుకుతోంది. భారీ మొత్తంలో వెనకేసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లకు శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.
రేసులో ఎవరంటే..?