చండూరు, సెప్టెంబర్ 17 : రైతులు పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేసుకోవాలని చండూరు ఏవో పి.మల్లేష్ అన్నారు. చండూరు మండలం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధి కుమ్మందానిగూడెం గ్రామంలో గురువారం పత్తి పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు, పప్పు ధాన్యాలపైన వాటి ఉపయోగం గురించి ఆత్మ సౌజన్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. పత్తి పంట విత్తనం వేసుకునే మొదలు పత్తి తీసే వరకు రైతులు చేపట్టాల్సిన సాగు పద్ధతులను వివరించారు. ప్రధానంగా పత్తి పంట నల్లరేగడి భూముల్లో మాత్రమే వేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం పత్తి పంటలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున ఎకరానికి ఫిప్రోనిల్ 400 gram లు+13.0.45 kg + అగ్రోమిన్ మాక్స కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. పత్తిలో అంతర్ పంటలుగా కంది, దోస ఇతర కూరగాయలు వేసుకోవాలని సూచించారు. రైతు సోదరులు ఎరువులు, పురుగు మందులు తక్కువ మోతాదులో వాడాలని, సేంద్రీయ ఎరువుల వినియోగం అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ శంకర్, ఉప సర్పంచ్ సరికొండ ముత్యాలు, ఏఈఓ పి.పవన్, బీటీఎం మునుగోడు రమేష్, రైతులు వర్కాల శ్రవణ్, కట్కూరి యాదయ్య, వర్కాల శంకరయ్య, ఎండీ సత్తార్, తోటకూరి రాములు, కడారీ లింగయ్య, గాలి దాసు, కట్కూరి సందీప్, ఎండీ షరీఫ్, గాలి జగన్, గాలి మహేష్, దోటి మధు పాల్గొన్నారు.