చండూరు, నవంబర్ 28 : నేడు జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ దామోదర్ రావు తెలిపారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. స్థానిక డాన్బోస్కో కళాశాల ప్రాంగణంలో సిబందికి ఎన్నికల సామగ్రిని బుధవారం పంపిణీచేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ప్రోసిడింగ్ అధికారులకు ఈవీఎంలు, వీవీప్యాట్లను పోలింగ్ స్టేషన్ల వారీగా అందింజేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో చండూరు 41, నాంపల్లి 46, మునుగోడు 44, మర్రిగూడ 33, గట్టుప్పల్ 17, నారాయణపురం 54, చౌటుప్పల్ 72 మొత్తం 307 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 2,52,648 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 30 మంది సెక్టోరియల్ అధికారులు, ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రోసిడింగ్ అధికారితో పాటు ముగ్గురు ఎన్నికల అధికాలతో పాటు ఇద్దరు పోలీసులు విధులు నిర్వహించనున్నారు, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 112 పోలింగ్ స్టేషన్లలో మరో ఇద్దరు అదనపు పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గాన్ని 30 రూట్లుగా విభజించి ఒకొరూటుకు 2 సెక్టార్ అధికారులను నియమించామన్నారు . ఎన్నికల్లో 307 మంది పోలింగ్ అధికారులు, 307 మంది అదనపు పోలింగ్ అధికారులు, 614 మంది ఓపీఓలు వీరితోపాటు 71 మంది అధికారులు సూక్ష్మ పరిశీలకులుగా విధులు నిర్వహించనున్నారు. 55 సమస్యాత్మక కేంద్రాలలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 1000 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు. వీరితోపాటు 700 మంది పారామిలటరీ పోలీసులు విధులు నిర్వహించనున్నారు. 2 డీఎస్పీలు,6 మంది సీఐ లు 10 మంది, ఎస్ఐ లు శాంతిభద్రతలు పర్యవేక్షనున్నట్లు వారు తెలిపారు.
నాంపల్లిలో
నాంపల్లి :మండల వ్యాప్తంగా 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 32 గ్రామ పంచాయతీల గాను 46 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇందులో 7 సమస్యాత్మక పోలింగ్ బూతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్ నిర్వహణ కోసం 184 మందిని అధికారులను ఏర్పాటు చేసినట్లు ఆర్ఐ దయాకర్ రెడ్డి తెలిపారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా మంచినీరు, వీల్స్ చైర్లను అందుబాటులో ఉంచినట్లు పేరొన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా లోకల్ పోలీస్ సిబ్బంది కాకుండా 81 మంది పోలీస్ సిబ్బందిని కేటాయించినట్లు లచ్చిరెడ్డి తెలిపారు.
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
మునుగోడు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏ ర్పాట్లు పూర్తి చేసింది. చండూరులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ అధికారులు పోలీస్ బందోబస్తు నడుమ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ గురువారం ఉదయం 7 నుంచి సాయ ంత్రం 6గంటల వరకు జరగనుంది.ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బీజేపీ నుంచి చల్ల మల కృష్ణారెడ్డి బరిలో నిలిచారు.మండలంలో 44 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. మండల వ్యాప్తంగా మొత్తం ఓట ర్లు 38,921 పురుషులు19,21 మహిళలు19,399 మంది తమ ఓటు హక్కును వినియోగి చుకొనున్నారు.11సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.ఈ కెమెరాలన్నింటినీ నల్లగొండ కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు.