చండూరు, నవంబర్ 13 : మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్రెడ్డి కూతురు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఆమె.. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఆమెతోపాటు ఎన్నో ఏండ్లుగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఒంటెద్దు పోకడపై తీవ్రంగా మండిపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. దివంగత ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి కూతురు, కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతీరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. స్రవంతికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెను కాదని బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి టికెట్ కేటాయించింది. దాంతో పాల్వాయి స్రవంతి మునుగోడు అభివృద్ధి కోసం బీఆర్ఎస్లో చేరారు. దాంతో మునుగోడు కాంగ్రెస్లో అలజడి మొదలైంది. కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకులంతా ఆమె బాటలోనే పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా బీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. కేవలం కోమటిరెడ్డి అనుచరులు మాత్రమే కాంగ్రెస్లో ఉండే అవకాశం ఉంది.
ఒంటెద్దు పోకడలే కారణం..
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మొదటి నుంచి ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్ ఆయనపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. గతేడాది తన స్వలాభం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఆయన పార్టీలో ఉంటే పార్టీ నాయకులను కాదని, కేవలం తన వెంట ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తారని, వారే పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తారని, కనీసం కార్యకర్తలను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్రవంతి వెంటే కాంగ్రెస్ క్యాడర్
దివంగత ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన అనుచరులు చాలా మంది మునుగోడు నియోజకవర్గంలో ఉన్నారు. అలాంటి నేత వారసురాలిగా పాల్వాయి స్రవంతీరెడ్డి కూడా మునుగోడు నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆమె బీఆర్ఎస్లో చేరడంతో క్యాడర్ కూడా ఆమె వెంటే పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం కొద్దిమంది బీఆర్ఎస్లో చేరగా.. మిగతా వారు త్వరలోనే చేరే అవకాశం ఉంది. ఆమె వెంట బీఆర్ఎస్లో చేరిన వారిలో కౌన్సిలర్ మంచుకొండ కీర్తి సంజయ్, కోఆప్షన్ సభ్యుడు రావిరాల నగేశ్, మాజీ ఎంపీటీసీ నెర్లకంటి రవికుమార్సాగర్, నాయకులు పన్నాల శ్యామ్, చొప్పరి రవితేజ, బిజ్జాల ప్రవీణ్, శ్రీహరిచారి, తాళ్ల రమేశ్, తార శ్యామ్, పాల్వాయి వెంకట్రెడ్డితో పాటు 100 మంది కార్యకర్తలు ఉన్నారు.
బీఆర్ఎస్లో చేరిన చండూరు పట్టణ బీజీపీ నాయకులు
చండూరు : పట్టణానికి చెందిన పలువురు బీజేపీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజీపీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డి వైఖరి నచ్చకనే తాము బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. మునుగోడు అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని ప్రజలంతా నమ్ముతున్నారని, అభివృద్ధిలో తామూ భాగస్వాములయ్యేందుకే కూసుకుంట్ల ఆధ్వర్యంలో పని చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో కౌన్సిలర్ గుంటి వెంకటేశం, బీజేపీ జిల్లా నాయకుడు కొత్త పాటి సతీష్, పట్టణ అధ్యక్షుడు అన్నెపర్తి యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఏనుగు వెంకట్రెడ్డి, పట్టణ కోశాధికారి కొత్త అంజిబాబు, కార్యదర్శి రాపోలు జగదీశ్వర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాపోలు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి ఇడికోజు నాగరాజు, బూత్ అధ్యక్షుడు రావిరాల భార్గవ్, ఎస్సీ మోర్చా నాయకుడు బుషిపాక నగేష్తో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, కౌన్సిలర్ అన్నపర్తి శేఖర్ పాల్గొన్నారు.
మర్రిగూడకు చెందిన పలువురి చేరిక
మర్రిగూడ : మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో మర్రిగూడకు చెందిన డీసీసీ ఉపాధ్యక్షుడు పొనుగోటి విజయరామారావు, మందడి అల్వాల్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ యూత్ నాయకులు మల్గిరెడ్డి గోవర్ధ్దన్రెడ్డి, దొడ్డి మహేశ్, తుప్పరి రఘు, యాదయ్య, రామస్వామి, బూరెల రవి, మామిడి సాయికుమార్, పందుల నగేశ్, ఇరుగంటి అభిలాశ్ ఉన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మెండు మోహన్రెడ్డి, ఎంపీటీసీ ఊరిపక్క సరితానగేశ్, మాజీ సర్పంచ్ చెర్కు లింగంగౌడ్, నాయకులు పాల్గొన్నారు.