నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆదివారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నల్లగొండ ఎంపీపీ మనిమద్దె సుమన్తోపాటు చిట్యాల మున్సిపాలిటీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్ జమాండ్ల జయమ్మాశ్రీనివాస్రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ గోధుమగడ్డ పద్మాజలంధర్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కందాటి రమేశ్రెడ్డి తదితరులు గులాబీ కండువా కప్పుకొన్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు.
నల్లగొండ, అక్టోబర్ 15 : నల్లగొండ నియోజకవర్గంలో ఏకైక కాంగ్రెస్ ఎంపీపీ మనిమద్దె సుమన్ బీఆర్ఎస్లో చేరడంతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి గట్టి షాక్ తగిలినట్లు అయ్యింది. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం హైదరాబాద్లో బీఆర్ఎస్లో చేరారు. మంత్రి కేటీఆర్ సుమన్కి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నల్లగొండ నియోజకవర్గంలో నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మండలాలు ఉండగా, ఒక్క నల్లగొండ మినహాయిస్తే తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి ఎంపీపీలు బీఆర్ఎస్కు చెందినవారే కాగా నల్లగొండ ఎంపీపీ సుమన్ మాత్రమే కాంగ్రెస్లో ఉన్నారు. ఆయన సైతం బీఆర్ఎస్లో చేరడంతో నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఎంపీపీ లేకుండా పోయారు.
ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. నల్లగొండ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి జరగుతుందని, అది పూర్తిస్థాయిలో కొనసాగాలంటే మరోసారి కేసీఆరే సీఎం కావాలనే ఆలోచనతో బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడే కంచర్ల కృష్ణారెడ్డితోపాటు మారగోని గణేశ్ పాల్గొన్నారు.
చిట్యాల : చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, యువజన సంఘం నాయకుడితోపాటు మరికొంత మంది ముఖ్యులు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ పార్టీ నలుగురు కౌన్సిలర్లలో ఇద్దరు బీఆర్ఎస్లో చేరగా మిగిలిన ఇద్దరిలోనూ మరో కౌన్సిలర్ బీఆర్ఎస్లో చేరే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 4వ వార్డు కౌన్సిలర్ జమాండ్ల జయమ్మాశ్రీనివాస్రెడ్డి, 11వ వార్డు కౌన్సిలర్ గోధుమగడ్డ పద్మాజలంధర్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కందాటి రమేశ్రెడ్డి తదితరులు మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
కౌన్సిలర్లతోపాటు కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకుడు కందాటి సత్తిరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు చెరుకు సాయిరాం, గౌడ సంఘం పట్టణాధ్యక్షుడు పబ్బు జగదీశ్గౌడ్, రావుల మల్లేశ్, జనపాల నరేశ్, ఎన్ఎస్యూఐ మండలాధ్యక్షడు చెరుకు బాలక్రిష్ణ, రావుల రాంరెడ్డి, జమాండ్ల లింగారెడ్డి, రావుల సత్యనారాయణ, సామ విజయభాస్కర్రెడ్డి, జమాండ్ల చంద్రశేఖర్రెడ్డి, జమాండ్ల వెంకట్రెడ్డి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి పాల్గొన్నారు.