హాలియా, నవంబర్ 2 : కాంగ్రెస్ నాయకులు కొంత మంది బీఆర్ఎస్ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, అయినా కార్యకర్తలు, ప్రజలు తమ వెంటనే ఉన్నారని, వారు ఎన్నికుట్రలు చేసినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 25 కాంగ్రెస్ కుటుంబాలు గురువారం హాలియాలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచితవిద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో లేవన్నారు. యాసంగిలో రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు పడకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోనికి వస్తే రైతుబంధును రూ.16వేలకు పెంచడంతో పాటు రూ. 400కే గ్యాస్ సిలిండర్, రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, అర్హులైన పేద మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున అందించనున్నట్లు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో మాజీ ఉప సర్పంచ్ ఉడ్తూరి మట్టారెడ్డితో పాటు బూరుగు పెద సాంబయ్య, కాశయ్య, చిన సాంగయ్య, మొటమర్రి కొండల్, అంజయ్య, మురళీ వెంకటేశ్వర్లు, ప్రభాకర్, కోటేశ్, రవి, మల్లికార్జున్, శివ, అశోక్, కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎన్నమల్ల సత్యం, మార్కెట్ డైరెక్టర్ ఉడ్తూరి శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కోప్షన్ సభ్యుడు రావుల లింగయ్య, పంగ లక్ష్మణ్యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ బొమ్మిశెట్టి ఆంజనేయులు, కొంగరి రమణయ్య, బూడిద శేఖర్, గార్లపాటి ఎల్లయ్య, ఊర అఖిల్ పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలోని పులిచర్ల గ్రామానికి చెందిన 50 కాంగ్రెస్ కుటుంబాలు గురువారం ఎమ్మెల్యే నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి. త్రిపురారం మండల కేంద్రంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో వీరబోయిన ఎల్లయ్య, దండుగుల శ్రీనయ్య, రాయల వెంకటయ్య, కోరెక్క శ్రీను, రాయల నాగయ్య, జంగాల అంజయ్య, చిలుముల అనిల్, వీరబోయిన అనిల్, జోడుపల్లి నర్సింహ, కడారి వెంకటయ్య, గుండల హరిబాబు, బక్కితట్ల కొండల్, పంగ వెంకటయ్య, కార్యకర్తలు ఉన్నారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, పార్టీ రాష్ట్ర నాయకుడు దేవసాని శ్రీనివాస్రెడ్డి, గ్రామశాఖ అద్యక్షుడు బుడిగపాక లక్ష్మయ్య, ఉప సర్పంచ్ చిరంజీవి, నాయకులు ఎల్లయ్య, పాపయ్య, అంజి, కొండల్ పాల్గొన్నారు.