నకిరేకల్, డిసెంబర్ 22 : నకిరేకల్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రాచకొండ విజయ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి సాదరంగా ఆహ్వానించారు.
నేరేడుచర్ల : దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగల సత్తా, ధైర్యం సీఎం కేసీఆర్కు మాత్రమే ఉందని, ఆ నమ్మకంతోనే వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జేపీఎస్ ఆటో యూనియన్కు చెందిన 10 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలు, కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, ఎంపీపీ లకుమళ్ల జ్యోతి, జడ్పీటీసీ రాపోలు నర్సయ్య, డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరిబండి సురేశ్బాబు, గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ, పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్లు సాయి, బాషా, సరిత, నాగవేణి, లలిత, సులోచన పాల్గొన్నారు.
నల్లగొండ రూరల్ : బీఆర్ఏస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చిన్నసూరారం గ్రామానికి చెందిన 20 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామ సర్పంచ్ నారగోని నరసింహ, సంకు ధనలక్ష్మి ఆధ్వర్యంలో నల్లగొండలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో సుంకరి శేఖర్, వెంకన్న, యాదయ్య, బాలయ్య, పద్మ, బీరెల్లి నారాయణరెడ్డి, కవిత, రమేశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బకరం వెంకన్న పాల్గొన్నారు.