సూర్యాపేట, మార్చి 18 : లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టరేట్లో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించామని సూర్యాపేట కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకట్రావ్ తెలిపారు. కంట్రోల్ రూమ్ను సోమవారం అదనపు కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఈ సెల్ నుంచి సి-విజిల్, 1950 కాల్ సెంటర్, సువిధ పర్మిషన్స్, ఎన్జీఆర్పీఎస్ పోర్టల్, పీడబ్ల్యూడీ సాక్షమ్ యాప్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో జరిగే సంఘటనలు, సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ అప్పారావు, ఏఓ సుందర్శన్రెడ్డి పాల్గొన్నారు.