భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 28: అన్వితారెడ్డి సాధించిన విజయాలు జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భువనగిరి జిల్లాకు చెందిన పడమటి అన్వితారెడ్డి, కోచ్ బచినేపల్లి శేఖర్బాబు, అన్వితారెడ్డి తల్లి చంద్రకళను సోమవారం పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్వితారెడ్డి ప్రపంచంలోనే పెద్దదైన ఎవరెస్ట్ శిఖరంతో పాటు మనస్లూ, మౌంట్ ఎల్బ్రోస్, రెనోక్, బీసీ రాయ్, ఖండి పర్వతాలను అధిరోహించి ఏడు ఖండాల్లో పర్యటించారని, ఆమె సాధించిన విజయాలు యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. డిసెంబర్లో విన్సన్ పర్వతారోహణకు వెళ్తున్న అన్వితారెడ్డికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
మన జిల్లాలో రాక్ ైక్లెంబింగ్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, తల్లితండ్రులు సహకరించి తమ పిల్లలను ప్రొత్సహించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్తివారీ, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి ఎం.నాగేశ్వరాచారి, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించి జిల్లాకే గర్వకారణంగా నిలిచిన భువనగిరి పట్టణానికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్వితారెడ్డికి సువర్ణ గృహ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూ.3లక్షలు, హరి ఇన్ఫ్రా ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూ.2లక్షల చెక్కులను జిల్లా పరిషత్ స్త్రీ, శిశు సంక్షేమశాఖ స్థాయి సంఘం చైర్మన్, బీబీనగర్ జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్రెడ్డి కలెక్టర్ సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ జిల్లాకు చెందిన అన్వితారెడ్డి పర్వతారోహణలో ప్రపంచ ఖ్యాతి సాధించడం సంతోషకరమన్నారు.