రామగిరి, జనవరి 3 : పార్లమెంట్ ఎన్నికలు పటిష్టంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం ఎక్సైజ్, రవాణా, వాణిజ్య పన్నుల శాఖ, ఇన్ కం ట్యాక్స్ అధికారులతో జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దున ఉన్న మిర్యాలగూడను ఎక్సెండిచర్ సెన్సిటివ్గా గుర్తించాలని నిర్ణయించి ఎన్నికల కమిషన్కు ప్రతిపాదనలు పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచాలన్నారు.
మద్యం అక్రమ రవాణా నియంత్రణతోపాటు అనేక అంశాలపై చర్చించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సరిహద్దు జిల్లా పాలనా అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ, పోలీసు, ఎక్సైజ్, ఇతర శాఖలు
పాల్గొన్నారు.