కట్టంగూర్, జనవరి 13 : ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం కట్టంగూర్ తాసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తుల ఆన్లైన్, ఎలక్టోరల్ రివిజన్ ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాటా ఎంట్రీలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా సవరణ పక్రియను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సూచనలు పాటించాలని సూచించారు. ఆయన వెంట తాసీల్దార్ స్వప్న, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, డీటీ సుకన్య, ఎంపీఓ మహ్మద్ అథర్ పర్వేజ్, సిబ్బంది పాల్గొన్నారు.
నార్కట్పల్లి : తాసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సందర్శించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు.