భువనగిరి కలెక్టరేట్, మే 23 : జూన్ 4న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జెండగే ఏఆర్వోలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, నోడల్ అధికారులతో సమావేశమై పార్లమెంట్ కౌంటింగ్ కోసం చేపట్టే ఏర్పాట్లను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియలో ఓటు గోప్యత ముఖ్యమని, స్ట్రాంగ్రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కు, కౌంటింగ్ అనంతరం తిరిగి స్ట్రాంగ్రూమ్కు ఈవీఎంలను తీసుకెళ్లడం, సీల్వేసి భద్రపర్చడంలో ఎన్నికల నిబంధనలను పకాగా పాంటించాలని సూచించారు.
కౌంటింగ్ కమ్యూనికేషన్ ప్లాన్, కౌంటింగ్ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లు, కంప్యూటర్లు, సానర్లు, ప్రింటర్లు, స్టేషనరీ, ఫర్నిచర్, తాగునీరు, టిఫిన్స్, భోజనాలు తదితర ఏర్పాట్లను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు పకాగా ఏర్పాటు చేయాలన్నారు.
కార్యక్రమంలో జిల్లా ఉప ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్షాలోమ్, భువనగిరి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ అమరేందర్, ఆలేరు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, మునుగోడు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సుబ్రహ్మణ్యం, నకిరేకల్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పూర్ణచందర్, తుంగతుర్తి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి బీఎస్ లత, జనగాం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కొమురయ్య, ఇబ్రహీంపట్నం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అనంతరెడ్డి, నోడల్ అధికారులు, ఎంకోర్ ఆపరేటర్లు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.