నల్లగొండ, మే 18: పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులు బాధ్యతతో, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన సిబ్బందికి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్ల్లు, మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల పోలింగ్లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, అదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఆర్వో, ఏఆర్ఓల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఎన్నికల నియమావళి కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించిన సమయం నుంచి ముగిసే వరకు ఏయే స్టేజీల్లో ఎటువంటి పనులు చేయాలనే విషయమై ట్రైనర్ బాలు వివరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్(పులిచింతల) నటరాజన్, డీఆర్డీఓ నాగిరెడ్డి, నల్లగొండ, దేవరకొండ, హుజూర్నగర్, సూర్యాపేట, చండూరు ఆర్డీఓలు, శిక్షణ కార్యక్రమాల నోడల్ అధికారి శ్రవణ్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ పాల్గొన్నారు.