నల్లగొండ, ఫిబ్రవరి 23 :మార్చి 3న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానిన విజయవంతం చేయాలని, 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుకలు వేయాలని కలెక్టర్ దాసరి హరిచందన కోరారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఆమె పల్స్ పోలియో నిర్వహణపై జిల్లా స్థాయి ట్రాస్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. మార్చి 3న ఏదైనా కారణం చేత చుకలు వేయించుకోలేని వారికి 4, 5 తేదీల్లో ఇంటింటికీ తిరిగి బృందాలు పోలియో చుకలు వేస్తాయని తెలిపారు.
నల్లగొండ జిల్లాలో సుమారు 1,54,895 మంది 5 సంవత్సరాల్లోపు చిన్నారులు ఉన్నారని చెప్పారు. పోలియో చుకలు వేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1,070 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 4,280 బృందాలు, 107 మంది సూపర్వైజర్లను నియమించామని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి జమీర్, మెడికల్ అధికారి ప్రశాంత్, జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.