దేవరకొండ, ఆగస్టు 26 : అనారోగ్యంతో బాధపడే నిరుపేదలు సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 156 మంది లబ్ధిదారులకు రూ.46.10లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నారని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, మాధవరం సునీతాజనార్దన్రావు, వంగాల ప్రతాప్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు టీవీఎన్.రెడ్డి, వల్లపురెడ్డి, రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, వేముల రాజు, మోహన్కృష్ణ, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, ఉజ్జిని విద్యాసాగర్రావు, వడ్త్య దేవేందర్నాయక్, సైదులు, బాలయ్య, వశ్యానాయక్, నర్సింహ, రాములు, రామారావు, ప్రదీప్ పాల్గొన్నారు.