మునుగోడు, ఫిబ్రవరి 10 : కస్టమ్ మిల్లింగ్ రైస్ (లెవీ)ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ మిల్లర్లకు స్పష్టం చేశారు. మంగళవారం మునుగోడులో మల్లికార్జున రైస్ మిల్లును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లెవీని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇప్పటికే మిల్లర్లకు సూచించడం జరిగిందననారు. ధాన్యం సేకరణలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉందని, అలాగే లెవీ త్వరగా పూర్తి చేయడంలో కూడా జిల్లాకు మంచి పేరు వచ్చేలా మిల్లర్లు కృషి చేయాలని పేర్కొన్నారు.