చిట్యాల, జనవరి 28 : పేదల సంక్షేమానికి పాటుపడే నాయకుడు దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని తాళ్లవెల్లెంల గ్రామంలో రూ.10లక్షల ఎస్డీఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. రైతు, దళిత బంధు, కల్యాణలక్ష్మి, రైతుబీమా లాంటి గొప్ప పథకాలను ప్రవేశపెట్టి భారత దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుదన్నారు. సీఎం కేసీఆర్ నాయత్వం దేశానికి అవసరమని ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. తన సొంత గ్రామానికి ధీటుగా తాళ్లవెల్లెంల గ్రామానికి అధిక నిధులు కేటాయించానని తెలిపారు. గ్రామానికి ఇప్పటికే రూ.కోటి నిధులు కేటాయించానని, పెండింగ్ పనులకు మరో రూ.20లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, నాయకులు సుంకరి యాదగిరి, ఆవుల ఐలయ్య, కల్లూరి మల్లారెడ్డి పాల్గొన్నారు.
కట్టంగూర్ : గ్రామీణ కళాకారులు నైపుణ్యం, స్వయంకృషితో ఎదగాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కట్టంగూర్కు చెందిన యువ దర్శకుడు, ఆర్టిస్టు బొడ్డుపల్లి మహేశ్(ఆర్కేఎస్)తో చిత్రీకరించిన పెద్దగట్టు లింగన్న జాతర వీడియో పాటను నార్కట్పల్లిలోని స్వగృహంలో యూట్యూబ్ ఛానల్లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాకారులకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీనిచ్చారు. అనంతరం పాటను చిత్రీకరించిన దర్శకుడు, టెక్నీషియన్స్, టీం సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, పీఏసీఎస్ చైర్మన్ నూక సైదులు, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, పులిగిల్ల వెంకన్న పాల్గొన్నారు.