సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 24 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో చారిత్రాత్మకమైన రాచకొండ ప్రాంతానికి పూర్వవైభవం వస్తుందని గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మండలంలోని రాచకొండ ప్రాంతంలో బుధవారం ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన రాచకొండ పోర్టు, సంకెళ్లబావితో పాటు పలు ఆలయలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చారిత్రత్మకమైన ప్రాంతాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ప్రకృతి సోయగాల నడుమ రాచకొండ ప్రాంతం అద్భుతంగా ఉందన్నారు.