ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేటలో జిల్లా పరిపాలన భవనాలతోపాటు పలు కార్యాలయాలను పండుగ వాతావరణంలో ప్రారంభించారు. మొదట మెడికల్ కళాశాల ప్రధాన భవన సముదాయాన్ని, అనంతరం ఇంటిగ్రేటెడ్ మోడల్ మారెట్ను అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ను కుర్చీలో కూర్చోపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రం కావడమే ఒక చరిత్ర అని, సూర్యాపేట చకగా అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలకు ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
– నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ)
మెడికల్ కాలేజ్ ప్రారంభం
సూర్యాపేట అర్బన్, ఆగస్టు 20 : జిల్లా కేంద్రంలో రూ.500 కోట్లతో నిర్మించిన మెడికల్ కాలేజ్ భవన సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆదివారం సూర్యాపేట ప్రగతి నివేదన సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి కాన్వాయ్గా బయల్దేరి మెడికల్ కళాశాలకు వెళ్లారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల విద్యార్థులు కేసీఆర్పై పూల వర్షం కురిపించారు. పూజల అనంతరం సీఎం కేసీఆర్ భవనాలను ప్రారంభించి కాలేజీ ప్రిన్సిపాల్ శౠరదాదేవిని సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఎస్పీ కార్యాలయం..
సూర్యాపేటసిటీ, ఆగస్టు 20 : జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్.. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి ఆదివారం ప్రారంభించారు. పోలీస్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ను సీట్లో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
సాయంత్రం 3.48 గంటలకు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్తోపాటు పలువురు ప్రజా ప్రతినిదులు ఘన స్వాగతం పలికి ముఖ్యమంత్రి కేసీఆర్కు జ్ఞాపికను అందజేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ తీరు అద్భుతమని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాష్టర పోలీస్ అందిస్తున్న సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అందుబాటులోకి..
బొడ్రాయిబజార్, ఆగస్టు 20 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్లో రూ.30 కోట్లతో 6 ఎకరాల స్థలంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ను సీఎం కేసీఆర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. మధ్యాహ్నం 3:04 గంటలకు మార్కెట్కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డితో కలిసి మధ్యాహ్నం 3:06 గంటలకు మార్కెట్ ఎదుట శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ కాంప్లెక్స్లో వేదబ్రాహ్మణుల ఆశీర్వాదం అం దుకొని కూరగాయల వ్యాపారుల వద్దకు చేరుకొని అభివాదం చేస్తూ మీది ఎక్కడ? ఏ ఊరు అంటూ ఆప్యాయంగా పలుకరించారు. వ్యాపా రం మంచిగా చేసుకొమ్మని ఆశీర్వదిస్తూ ముం దుకు సాగారు. అనంతరం మార్కెట్ కాంప్లెక్స్లో కలియతిరుగుతూ మంత్రి జగదీశ్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమి టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డికి జ్ఞాపికలు అందజేశారు. అంతకు ముందు సీఎస్ శాంతికుమారి, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్రావు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను పరిశీలించారు.