మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అని చావు నోట్లో తలపెట్టి నాటి ఉద్యమ రథసారధి, నేటి ముఖ్యమ్ంరత్రి కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు దీక్ష చేపట్టి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. ఉద్యమానికి ఊపిరిలూది ప్రతి ఒక్కరినీ కార్యోణ్ముఖులను చేశారు. ఆ నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన చేసేదాకా అలుపెరుగని పోరుసల్పారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు మంగళవారానికి 13 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దీక్షా దివస్ వేడుకలు నిర్వహించారు. నాటి ఘటనను గుర్తు చేసుకొని సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాల ప్రజల్లో చెరుగని ముద్ర వేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ పాలనను కొనియాడారు.
హాలియా, నవంబర్ 29 : 13 ఏండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ నేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మబలిదానికి సిద్ధమై దీక్ష చేయడంతోనే కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం హాలియాలోని బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడంతోపాటు తెలంగాణ అమరలవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 14ఏండ్లు అంకుటిత దీక్షతో ఉద్యమాన్ని నడపడంతోపాటు ఆత్మబలిదానానికి సిద్ధపడిన గొప్ప నాయకుడు అన్నారు. దీక్షా దివస్తోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుందన్నారు. సబ్బండ వర్గాలు ఏకమై కొట్లాడినట్లు గుర్తుచేశారు. గత ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, మండలాధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, పట్టణాధ్యక్షుడు చేరుపల్లి ముత్యాలు, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, అన్నెపాక శ్రీను, ప్రసాద్ నాయక్, నాయకులు దోరెపల్లి వెంకటేశ్వర్లు, మట్టారెడ్డి, ఆవుల సైదులు, కంపసాటి గంగాభవానీ, సురభి రాంబాబు పాల్గొన్నారు.
తుంగతుర్తిలో..
తుంగతుర్తి : దీక్షా దివస్ను పురస్కరించుకొని టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఎమ్మెల్యే కిశోర్ నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య, నాయకులు గుండగాని రాములుగౌడ్, కటకం వెంకటేశ్వర్లు, గోపగాని శ్రీను, తడకమళ్ల రవికుమార్, చెరుకు సృజనాపరమేశ్, వంశీగౌడ్, పూసపల్లి శ్రీను, కిరణ్, మధు, సైదులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్..
రామగిరి : నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కట్టా శ్రీనివాస్, జిల్లా కో ఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులుయాదవ్ కేక్ కట్ చేశారు. తెలంగాణ ఏర్పాటు కోసం 2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్షకు దిగినట్లు గుర్తుచేశారు. సుంకరబోయిన సత్యనారాయణ, మహేశ్, కల్యాణ్, నవీన్రెడ్డి, నాగరాజు, కిశోర్ పాల్గొన్నారు.