నల్లగొండ, ఆగస్టు 6 : ప్రగతి చక్రం మరింత వేగంగా పరుగులు పెట్టనుంది. 91 యేండ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీకి ప్రభుత్వం సరికొత్త జోష్ నింపింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ్ద (టీఎస్ఆర్టీసీ)లో పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని గత నెల 31న సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ శుభవార్తను నిజం చేస్తూ ఆదివారం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించి ఆర్టీసీ కార్మికులకు మర్చిపోలేని కానుక ఇచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందడంతో ఇక నుంచి ఆర్టీసీ కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో కింది స్థ్దాయిలో పని చేసే ఉద్యో గి నుంచి ఉన్నత స్థ్దాయి ఉద్యోగి వరకు ఈ క్రమబద్ధ్దీకరణ జరగనుంది. జిల్లాలో ఏడు ఆర్టీసీ డిపోలు ఉండగా ఆయా డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్లు, వర్కర్లు, మెకానిక్స్, కంట్రోలర్స్లతో పాటు అదకారులందరికి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వేతనాలు అందనున్నాయి.
కార్మికుల నిరసనతో దిగొచ్చిన రాజ్ భవన్
ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని గవర్నర్కు బిల్లు పంపగా పలు సాకులతో సంతకం చేయకుండా ఆపిన విషయం విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు రాజ్ భవన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దాంతో దిగివచ్చిన గవర్నర్ ఎట్టకేలకు సంతకం చేయటంతో బిల్లు అసెంబ్లీకి చేరి అక్కడ ఆమోదం పొందడంతో కార్మికుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సర్కార్ నిర్ణయం వల్ల జిల్లాలో జిల్లాలో 2,479 మంది ఉద్యోగులు ఇక ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా నల్లగొండ డిపోలో 497 మంది, దేవర కొండలో 428, కోదాడలో 276, యాదగిరి గుట్టలో 429, సూర్యాపేటలో 398 , మిర్యాలగూడలో 379, నార్కట్పల్లిలో 72 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కింది స్థాయిలో స్వీపర్ల నుంచి పై స్థ్దాయిలో పని చేసే కంట్రోలర్ వరకు ఉండగా వీరందరికీ త్వరలో రెగ్యులర్ కానుంది.
నల్లగొండలో ఒక్క బస్సుతో మొదలు
నల్లగొండ సిటీ : ఉమ్మడి జిల్లాలో 1932లో ఒక్క బస్సుతో ఆర్టీసీ ప్రస్థానం ప్రారంభమైంది. ఒక్క బస్సు 4 గురు సిబ్బంది ఉండేవారు. ఆ తర్వాత ప్రజాదరణతో నాలుగేండ్ల తర్వాత మరో 5 బస్సులను కొనుగోలు చేశారు. అప్పట్లో ఇతర వాహనాలు ఎక్కువగా లేకపోవడంతో బస్సుకు ఆదరణ బాగా ఉండేది. గతంలో గంట ముందు నుంచే ఎర్రబస్సు కోసం వేచి చూసేవారు . రవాణాకు కూడా వాహనాలు లేకపోవడంతో బస్సులోనే సరుకులు కూడా బస్సులోనే తరలిస్తుండడంతోబస్సులో ప్రయాణికులు లగేజి తో బస్సులో కిటకిట లాడుతూ వెళ్లేవారు. ఆతర్వాత 1958 లో ఏపీఎస్ఆర్టీసీగా అవతరించింది. దాంతో మరిన్ని బస్సులను కల్పించి. డిపోలను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ రవాణా వ్యవస్థగా మారింది. 2014లో తెలుగు రాష్ర్టాలు విడిపోవడంతో 2015 లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా రూపొందించింది.
2,058 బస్సులు 2479 మంది సిబ్బంది
ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 2 డిపోలతో మొదలైన ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం 2,058 బస్సులు 2.479 మంది సిబ్బంది. విధులు నిర్వహిస్తున్నారు. ఈ బస్సుల ద్వారా రోజుకు లక్షా మంది ప్రయాణం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆంధ్ర, మహారాష్ట్ర, బెంగళూరు కర్ణాటక ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7 డిపోలు ఉన్నాయి. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, యాదగిరిగుట్ట, నార్కట్పల్లి డిపోలు ఉన్నాయి. వీరంతా ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.
ఎర్రబస్సుకు ప్రజాదరణ ..
జిల్లాలో ప్రైవేట్, వ్యక్తిగత వాహనాలు పెద్దగా లేని సమయంలో ఆర్టీసీ బస్సును ప్రజలు బాగా ఆదరించారు. అయితే ఇటీవల వ్యక్తిగత, ఆటోలు, ఇతర రవాణా వాహనాలు రావడంతో ఆర్టీసీకి నష్టాల పర్వం ప్రారంభమైంది. అయితే నష్టాలను పూడ్చేందుకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పించి ప్రయాణికులకు చేరువ చేసింది. దాంతో కొద్ది మేర నష్టాలను అధిగమించి ఇటీవల లాభాల బాట పడుతున్నది.
ఆర్టీసీకి ప్రభుత్వఅండ ..
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం ఆర్టీసీకి అన్ని విధాలుగా అండగా నిలబడింది. తెలంగాణ ఉద్య మ సమయంలో అండగా ఉన్నందుకు ఉద్యోగులు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది.తాజాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి వారికి వరం ప్రకటించింది.
యాదగిరి గుట్ట డిపోలో స్వీట్ల పంపిణీ
యాదగిరిగుట్ట : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉద్యోగుల విలీన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపడంతో ఆర్టీసీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం యాదగిరిగుట్ట డిపో వద్ద డ్రైవర్లు, కండక్టర్లు కలిసి స్వీట్ల పంపిణీ చేసుకుని సంబురాలు నిర్వహించారు. ఒక్కరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గతంతో ఏ ప్రభుత్వాలు చేయని సాహసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపారని వారు ఆనందం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే బిల్లును గవర్నర్ ఆమోదం తెలుపడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మా బతుకుల్లో వెలుగులు నిండాయి. ఆర్టీసీ కార్మికులు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మాకు ఉద్యోగ భద్రత లభించడంతో పాటు ఆత్మైస్థెర్యాన్ని నింపింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీలో వినూత్న సంస్కరణలూ తీసుకువచ్చి లాభాల దిశగా తీసుకెళ్లడంతో పాటు విలీనం చేయడం సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత వల్లే సాధ్యమైంది. మా కల నెరవేర్చిన సీఎం కేసీఆర్కు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు.
– అశోక్, డ్రైవర్, మిర్యాలగూడ డిపో
సీఎం కేసీఆర్ రుణపడి ఉంటాం
ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తే కనీసం జీతం అందక ఎంతో ఇబ్బందులు పడ్డాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చారు కానీ, ఎవ్వరూ ఆర్టీసీ కార్మికుల గురించి ఆలోచించలేదు. సీఎం కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలిచారు. ఆయన రుణపడి ఉంటాం. నిజంగా కార్మికుల పక్షపాతి అంటే కేసీఆర్, మమ్ముల్నీ ప్రభు త్వంలోకి విలీనం చేయడంతో మా జీవితాలు మారాయి.
-లవయ్య, డ్రైవర్, ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో
సీఎం కేసీఆర్ ధన్యవాదాలు
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. తమ చిరకాల కోరికను సీఎం కేసీఆర్ నేరవేర్చారు. ప్రభుత్వ నిర్ణయంతో మేం ప్రభుత్వ ఉద్యోగులుగా మారాం. ఒక నిర్ణయంతో కష్టాలన్నీ తీరిపోయాయి. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ల కష్టాలను చూసి సీఎం కేసీఆర్ మనసు చలిచింది. ఆయన మా కార్మికుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
-ప్రవీణ్, ఆర్టీసీ వెల్ఫేర్ బోర్డు సభ్యుడు, యాదగిరిగుట్ట డిపో