దేవరకొండ: ప్రభుత్వం క్రైస్తవులకు అండగా ఉంటుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని ఐదు మండలాల్ల దేవరకొండ, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి మండలాల్లో క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యాత ఇస్తుందన్నారు. నియోజకవర్గంలో రూ.2లక్షలతో పేదక్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు. చర్చిల్లో ప్రభుత్వం అన్ని వసతులు కల్పించేందుకు నిధులు అందిస్తున్నట్లు రవీంద్రకుమార్ తెలిపారు. క్రిస్టియన్లు అందరూ సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఒ గోపిరాం, మున్సిపల్ చైర్మెన్ ఆలంపల్లి నర్సింహ్మ, ఎంపిపిలు నల్లగాసు జాన్యాదవ్, మాధవరం సునితజనార్ధన్రావు, మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, జెడ్పీటిసి రమావత్ పవిత్ర, కేతావత్ బాలునాయక్, వైస్ ఎంపిపి చింతపల్లి సుభాష్గౌడ్, రైతు బంద్ అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, టిఆర్ఎస్ రాష్ట్రనాయకుడు హన్మంత్ వెంకటేశ్గౌడ్, పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు టివిఎన్రెడ్డి, లోకసాని తిరుపతయ్య, మాజీ మున్సిపల్ చైర్మెన్ వ్యడ్త దేవేందర్నాయక్, కౌన్సిలర్లు పలేపు మల్లేశ్వరి అశోక్, జయప్రకాశ్ నారాయణ, వేముల రాజు, పొన్నబొయిన సైదులు, బొడ్డుపల్లి కృష్ణ, ప్రదీప్, మున్సిపల్ కమీషనర్, తహసిల్దార్లు, పాస్టర్లు పోట్ట ఆదాం, కృష్టఫర్, అమృతం, జాన్పాల్ తదితరులు పాల్గొన్నారు.