రామగిరి, మార్చి 13 : పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 41,168 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకుగాను 180 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిర్ణత సమయం కంటే 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులకు అనుమతి ఇస్తా రు. 9.35 గంటల తర్వాత ఎలాంటి అనుమతి ఉం డదు. పరీక్షలపై సందేహాలు, సూచనలు, ఫిర్యాదు ల కోసం డీఈవో కార్యాలయంలో పరీక్షల హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు డీఈవో బొల్లారం భిక్షప తి, సూర్యాపేటలో డీఈవో అశోక్, యాదాద్రిభువనగిరి జిల్లా డీఈవో కె.సత్యనారాయణ తెలిపారు.
నల్లగొండ జిల్లాలో 106 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 19,835 మంది విద్యార్థులు, సూర్యాపేటలో జిల్లాలో 69 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 12,403 మంది విద్యార్థులు, యాదాద్రిభువనగిరి జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 8,930 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం ఆయా డీఈవో కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా హెల్ప్డెస్క్ (కంట్రోల్ రూమ్స్) ఏర్పాటు చేశారు. వీటిలో ప్రత్యేక ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంచారు.
నల్లగొండ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ – 9121212504
సూర్యాపేట జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ – 9848809754
యాదాద్రి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ – 9010772080