చిట్యాల, డిసెంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం దేశభక్తి పేరుతో ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆరోపించారు. చిట్యాలలో జరుగుతున్న ఆ సంఘం మహాసభలకు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించే కేంద్రంలోని మోదీ ప్రభు త్వం బొదపెట్టాలన్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగు చట్టాలను కుదించాలన్నారు. మహాసభ ప్రాంగణ సూచికంగా ఏర్పాటు చేసిన సీఐటీయూ జెండాను సంఘం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు ఆవిష్కరించారు. చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యతన జరిగిన కార్యక్రమంలో తుమ్మల వీరారెడ్డి, డబ్బీకార్ మల్లేశ్, నారబోయిన శ్రీనివాసులు, సలీం, సైదులు, చింతపల్లి బయ్యన్న, వెంకటయ్య, ప్రమీల పాల్గొన్నారు.