బీఆర్ఎస్ అంటే స్కీమ్లు, కాంగ్రెస్ అంటే స్కామ్లు అని ఏ పార్టీ వల్ల మేలు జరుగుతుందో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండలంలోని పలు గ్రామాలతోపాటు సూర్యాపేట పట్టణంలో మంత్రి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ దామోదర్ రెడ్డి హయాంలో మూడు కొట్లాటలు, ఆరు కేసులు తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. సూర్యాపేటలో అరవయ్యేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలోనే చేశామని, అరోపణలు చేస్తున్న వారు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పదవులతో సొంత లాభం చూసుకునే కాంగ్రెస్ నాయకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
చివ్వెంల, నవంబర్ 26 : బీఆర్ఎస్ అంటే స్కీమ్లు.. కాంగ్రెస్ అంటే స్కామ్లు అని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంతో పాటు బడితండా, మూన్యానాయక్తండా, పాండ్యానాయక్తండా, రాజుతండా, సూర్యానాయక్తండా, అక్కలదేవిగూడెం అలాగే సూర్యాపేట మండలం లక్ష్మీనాయక్తండా, రాజానాయక్తండాలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ను నమ్మితే కరెంట్ ఖతమే అన్నారు.
దామోదర్రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు, ఆరు కేసులు తప్పా గ్రామాలు, పట్టణాల్లో జరిగిన అభివృద్ధి శూన్యమే అని తెలిపారు. ఆఖరిసారి అంటూ కొంగ జపం చేస్తున్న వారికి ఓటు వేస్తే భవిష్యత్ నాశనమే అని చెప్పారు. జగదీశ్రెడ్డి ఏమి చేయలేదంటున్న దామోదర్రెడ్డి వారి పాలన, మా పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. అరగంట సేపు మాట్లాడలేని, నిలబడలేని నాయకులతో అయ్యేదేం లేదన్నారు.
మనం వేసే ఓటు మనకు ఏం తెస్తదో ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. సూర్యాపేట ప్రజలను దశాబ్ద కాలంగా వేదించిన మూసీ మురికి నీరు, కరెంట్ కోతలు ఆకలి దారిద్య్రాలు పారదోలింది కారు గుర్తేనని తెలిపారు. కరువు కాటకాలతో భీడు భూములుగా మారిన నియోజక వర్గ భూములకు కాళేశ్వరం జలాలు తీసుకు వచ్చి సస్యశ్యామలం చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదన్నారు.
రాష్ట్రం వచ్చిన తర్వాత రైతు కష్టాలు, కరెంట్ కష్టాలు లేవన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో అర్హులైన వారకి పింఛన్లు, ప్రజలు కోరిన సమస్యలు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆసరా పింఛన్ పెంచుకుందామని విడుతల వారీగా రూ.5,016 చేస్తామని తెలిపారు. కేసీఆర్ బీమా కింద రూ.5 లక్షలు అందజేస్తామన్నారు. రేషన్కార్డు ద్వారా సన్న బియ్యం, సౌభాగ్య లక్ష్మి కింద మహిళలకు రూ.3 వేలు భృతి, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళా సమఖ్య సంఘాలకు సొంత భవనాలు నిర్మిస్తామని వెల్లడించారు. నియోజక వర్గ యువతీ యువకులు 25 వేల మందికి ఉపాధి కల్పనే ధ్యేయంగా డ్రై పోర్ట్, ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.
మీ బిడ్డగా భావించి మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా బడితండాకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. జిల్లా కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక అనుబంధ సంఘాలు, ముదిరాజ్, ఆర్య వైశ్య, గిరిజన, గోల్డ్ స్మిత్తో పాటు ఆయా సంఘాల ఆత్మీయ సమావేశాలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి ఘన స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో సన్మానించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ దరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, మాజీ ఎంపీపీ రౌతు నర్సింహారావు, సర్పంచులు సుధాకర్రెడ్డి, భద్రూనాయక్, సుశీలాసాగర్, భిక్షంనాయక్, గోవిందరెడ్డి, హనుమ, రావిచెట్టు సత్యం, గురువేందర్, అబ్బులు పాల్గొన్నారు.