చిట్యాల,ఫిబ్రవరి 11: చిట్యాల పోలీస్స్టేషన్ను శనివారం జిల్లా ఎస్పీ అపూర్వరావు తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించడంతోపాటు సిబ్బంది పనితీరు, కేసుల పురోగతి వివరాలను ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని క్రైమ్ రేటును తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. జాతీయ రహదారి వెంట రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. కేసులను త్వరితగతిన పూర్తిచేసి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. సమావేశంలో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, చిట్యాల, శాలిగౌరారం సీఐలు శివరాంరెడ్డి, రాఘవరావు, ఎస్ఐ ధర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ దేహదారుఢ్య పరీక్షలకు గ్రౌండ్లో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
నీలగిరి : జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి జరుగనున్న రెండో విడుత పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐల దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లను శనివారం సాయంత్రం ఎస్పీ అపూర్వరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేహాదారుఢ్య పరీక్షలను పూర్తి సాంకేతిక పరిజానంతో పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. అవకతవకలు జరుగకుండా గ్రౌండ్ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుదన్నారు. అభ్యర్థులు ఆత్మైస్థెర్యంతో విజయం కోసం కృషి చేయాలని సూచించారు.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చేప్పే వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మైదానంలో సాంకేతిక లోపాలను సిబ్బందికి తగిన ఆదేశాలిచ్చారు. ఆమె వెంట డీఎస్పీలు నరసింహారెడ్డి, ట్రాఫిక్ సీఐ శ్రీను,ఆర్ఐలు హారిబాబు,శ్రీను ,సంతోష్ ,ఎస్.రాజశేఖర్రెడ్డి, టెక్నికల్ టీం సభ్యులు పాల్గొన్నారు.